ఏపీలో హై అలెర్ట్…తెలంగాణకు మించి కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. రాత్రి రాత్రి 23 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కు [more]

Update: 2020-04-02 01:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. రాత్రి రాత్రి 23 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 111కు చేరుకుంది. తాజాగా నమోదయిన కేసుల్లో ఎక్కువ భాగం ఢిల్లీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారే కావడం గమనార్హం. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 కేసులు బయటపడ్డాయి. ఇరాన్, ఇండోనేషియా నుంచి వచ్చిన వారిని కలవడం వల్లనే ఈ వ్యాధి వ్యాప్తి చెందిందని తెలుస్తోంది. కరోనా బారిన పడిన వారు ఈ వారం రోజుల్లో ఎవరెవరిని కలిశారన్న దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

జిల్లా కేసుల సంఖ్య

గుంటూరు 20
ప్రకాశం 15
కృష్ణా 15
కడప 15
పశ్చిమగోదావరి 14
విశాఖపట్నం 11
తూర్పుగోదావరి 09
చిత్తూరు 06
నెల్లూరు 03
అనంతపురం 02
కర్నూలు 01

మొత్తం 111

Tags:    

Similar News