బ్రేకింగ్ : ఆంధ్రప్రదేశ్ లో పదివేలు దాటిన కేసులు.. పదిమంది?

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. పదివేల కేసులను ఏపీ దాటేసింది. తాజాగా గడచిన 24 గంటల్లో ఏపీలో 497 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. [more]

Update: 2020-06-24 08:17 GMT

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి ఆగడం లేదు. పదివేల కేసులను ఏపీ దాటేసింది. తాజాగా గడచిన 24 గంటల్లో ఏపీలో 497 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులోనే పదిమంది మృతి చెందారు. ఇప్పటి వరకూ 129 మంది కరోనా కారణంగా ఏపీలో మృతి చెందారు. కొత్తగా నమోదయిన కేసులతో ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 10,331 కరోనా పాజిటివ్ కేసుుల నమోదయ్యాయి. ఏపీలో యాక్టివ్ కేసులు 5,423 ఉండగా, డిశ్చార్జ్ అయిన వారు 4,723 మంది ఉన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి 37 మందికి, విదేశాల నుంచి వచ్చిన 12 మందికి కరోనా సోకిందని వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

Tags:    

Similar News