వర్క్ ఫ్రం హోంకు అనుమతి ఇవ్వండి..ఏపీ సచివాలయ ఉద్యోగులు

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 70 మంది ఉద్యోగులకు కరోనా సోకినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కరోనా బారిన పడి ఐదుగురు సచివాలయం ఉద్యోగులు మరణించారు. [more]

Update: 2021-04-24 01:11 GMT

ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 70 మంది ఉద్యోగులకు కరోనా సోకినట్లు చెబుతున్నారు. ఇప్పటికే కరోనా బారిన పడి ఐదుగురు సచివాలయం ఉద్యోగులు మరణించారు. దీంతో తమకు వర్క్ ఫ్రం హోం కు అనుమతి ఇవ్వాలని సచివాలయ ఉద్యోగులు కోరుతున్నారు. కరోనాకు హాట్ స్పాట్ గా సచివాలయం మారిందంటున్నారు. సచివాలయానికి వెళ్లాలంటే ఉద్యోగులు భయపడుతున్నారు. విజిటర్స్ కూడా కరోనా టెస్ట్ లు చేయించుకున్న తర్వాతనే లోపలకి రావాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.

Tags:    

Similar News