మళ్లీ మొదలయిన కరోనా.. ఆ ఆరు రాష్ట్రాల్లోనే…..

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, కర్ణాటక, కేరళ, గుజరాత్ [more]

Update: 2021-03-05 00:53 GMT

దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానా, పంజాబ్, కర్ణాటక, కేరళ, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువ సంఖ్యలో ప్రతి రోజు నమోదవుతున్నాయి. ఒక్క మహారాష్ట్రలో రోజుకు పదివేలకు పైగానే కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. మహారాష్ట్రలోని పూనే, ముంబయి, నాగపూర్, థానే నగరాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. దీంతో మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రయాణికులపైన అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాయి.

Tags:    

Similar News