పెళ్లి నిశ్చితార్థం లో కరోనా.. చనిపోయిన తండ్రి

నిశ్చితార్థంతో కరోనా తెచ్చుకున్నారు. మే 11న ధూల్ పేట్ లో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. కరోనాతో పెళ్లికొడుకు తండ్రి మృతి చెందాడు. [more]

Update: 2020-05-20 02:50 GMT

నిశ్చితార్థంతో కరోనా తెచ్చుకున్నారు. మే 11న ధూల్ పేట్ లో నిశ్చితార్థం జరిగింది. పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు కరోనా సోకింది. కరోనాతో పెళ్లికొడుకు తండ్రి మృతి చెందాడు. హైదరాబాదులో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. నిన్న ఓ అపార్ట్ మెంట్ లో పాతికమందికి కరోనా సోకిందన్న విషయం తీవ్ర చర్చనీయాంశంగా ఉండగానే, తాజాగా ఓ కుటుంబంలో 15 మందికి కరోనా నిర్ధారణ కావడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇటీవలే ఓ పెళ్లి నిశ్చితార్థం జరిపిన పెళ్లికొడుకు కుటుంబంలో 15 మంది కరోనా బారినపడ్డట్టు గుర్తించారు. ఈ నిశ్చితార్థ కోసం దాదాపుగా 300 మంది బంధుమిత్రులు హాజరైనట్లు సమాచారం. ఈ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి (58) కరోనాతో మరణించడంతో ఈ కేసులన్నీ వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News