Congrss : నేడు సీడబ్ల్యూసీ భేటీ… కీలక అంశాలపై

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నేడు సమావేశం కానుంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా [more]

Update: 2021-10-16 03:46 GMT

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ నేడు సమావేశం కానుంది. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలపై చర్చించనున్నారు. ఈ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపుకోసం అనుసరించాల్సిన వ్యూహాలపై సోనియాగాంధీ సభ్యుల అభిప్రాయం తీసుకోనున్నారు. ప్రధానంగా గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో పెట్టాల్సిన ఫోకస్ పై చర్చిస్తారు.

సంస్థాగత ఎన్నికలు…..

దీంతో పాటు కాంగ్రెస్ సంస్థాగత ఎన్నికలపై కూడా సోనియా గాంధీ వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చిస్తారు. జూన్ నెలలో పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉండే అవకాశముంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నిక కూడా ఈ సమావేశంలో కీలక అంశంగా మారనుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై పోరాడాల్సిన భవిష‌్యత్ కార్యాచరణపై కూడా సోనియా గాంధీ చర్చిస్తారు.

Tags:    

Similar News