సీట్ల పంపిణీపై కాంగ్రెస్ కీలక ప్రకటన

Update: 2018-11-01 08:43 GMT

తెలంగాణలో ప్రజాకూటమి ఏర్పాటు, సీట్ల పంపిణీపై పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇంఛార్జి కుంతియా కీలక ప్రకటన చేశారు. గురువారం ఢిల్లీలో అధిష్ఠాన పెద్దలతో భేటీ తర్వాత వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ 95 స్థానాలకు పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. 8 లేదా 9వ తేదీన అభ్యర్థులను ఒకేసారి ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, కాంగ్రెస్ 95 సీట్లు పోనూ మిగిలిన 24 సీట్లు విపక్షాలకు దక్కనున్నాయి. అయితే, టీడీపీ 18 సీట్లు, తెలంగాణ జన సమితి 12 స్థానాలు, సీపీఐ 5 స్థానాలు కచ్చితంగా కావాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక, సీట్ల లెక్కలు పంచాయితీ మొత్తం ఢిల్లీకి చేరింది. తమకు కావాల్సిన సీట్లపై సీపీఐ పెద్దలు కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తో భేటీ అయ్యారు. ఇక కోదండరాంను కూడా ఢిల్లీ రావాల్సిందిగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పిలుపు పంపారు. ఆయన రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. మొత్తానికి మరో రెండు మూడు రోజుల్లో సీట్ల లెక్కలు తేలనున్నాయి.

Similar News