మే 15వ తేదీ వరకూ లాక్ డౌన్ పొడిగింపు

కేరళలో లాక్ డౌన్ ను మే 15వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. కేరళలో కరోనా వైరస్ కంట్రోల్ లో ఉన్నప్పటికీ లాక్ [more]

Update: 2020-04-27 12:24 GMT

కేరళలో లాక్ డౌన్ ను మే 15వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. కేరళలో కరోనా వైరస్ కంట్రోల్ లో ఉన్నప్పటికీ లాక్ డౌన్ ను పొడిగించాలని విజయన్ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని మినహాయింపులతో కూడిన లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు విజయన్ తెలిపారు. నేడు జరిగిన ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ కు కూడా పినరయి విజయన్ దూరంగా ఉన్నారు. ప్రధాని మాట్లాడాల్సిన ముఖ్యమంత్రుల జాబితాలో తన పేరు లేదని అసంతృప్తితో వీడియో కాన్ఫరెన్స్ కు విజయన్ గైర్హాజరయ్యారు.

Tags:    

Similar News