పల్నాడు పౌరుషం తెలంగాణపై చూపించాలి

ఎన్నికల చివరి రోజు ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో [more]

Update: 2019-04-09 07:59 GMT

ఎన్నికల చివరి రోజు ప్రచారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, వైసీపీ అధినేత జగన్ పై చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ… నరేంద్ర మోడీ, అమిత్ షా దొంగలని ఆరోపించారు. నరేంద్ర మోడీకి కేసీఆర్, జగన్ పెంపుడు కుక్కలని, బిస్కెట్లు వేస్తే తోకజాడిస్తూ వెళతారని పేర్కొన్నారు. జగన్ కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో తేలుస్తానన్నారు. కేసీఆర్, జగన్ కలిసి ఏడు లక్షల ఓట్లు తొలగిస్తుంటే తాను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నానని అన్నారు. ‘నరేంద్ర మోడీ.. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండు.. తప్పుడు పనులు చేస్తే దేశం వదిలి పారిపోవాల్సి వస్తుంది’ అని హెచ్చరించారు. తమ మీద ఐటీ దాడులు చేయించే అధికారం నరేంద్ర మోడీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం కూడా నరేంద్ర మోడీకి సరెండర్ అయ్యిందన్నారు. పల్నాడు రోషం తెలంగాణపైన, కోడికత్తి పైన, నరేంద్ర మోడీపైన చూపించాలని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News