ఏపీ – తెలంగాణ మధ్య బస్సులు.. రేపు క్లారిటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై రేపు క్లారిటీ రానుంది. మంగళవారం ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాకపోకలపై [more]

Update: 2020-09-14 03:06 GMT

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలపై రేపు క్లారిటీ రానుంది. మంగళవారం ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాకపోకలపై స్పష్టత రానుంది. లాక్ డౌన్ సమయం నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ రాకపోకలు స్థంభించాయి. లాక్ డౌన్ మినహాయింపులతో ఇప్పడు ఎలాంటి ఇబ్బంది లేకున్నా, ఎన్ని బస్సు సర్వీసులు ఎవరు తిప్పాలన్న దానిపైనే నిర్ణయానికి రావాల్సి ఉంది. ఇరు రాష్ట్రాల ఎండీల సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల ఆర్టీసీ నష్టాల్లో కూరుకుపోయిన నేపథ్యంలో త్వరలోనే ఏపీ, తెలంగాణల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఉంటాయని చెబుతున్నారు.

Tags:    

Similar News