జగన్, చిరంజీవి భోజనం చేస్తూ?

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి అమరావతిలో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి సమావేశం జరిగింది. చిరంజీవి దంపతులను సాదరంగా వైఎస్ [more]

Update: 2019-10-14 09:45 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో మెగాస్టార్ చిరంజీవి అమరావతిలో భేటీ అయ్యారు. దాదాపు గంట సేపు వీరి సమావేశం జరిగింది. చిరంజీవి దంపతులను సాదరంగా వైఎస్ జగన్ తన ఇంటిలోకి ఆహ్వానించారు. జగన్ ఇంట్లోనే చిరంజీవి దంపతులు భోజనం చేశారు. సైరా సినిమా చూసేందుకు రావాల్సిందిగా జగన్ దంపతుల ను చిరంజీవి ఆహ్వానించారు. భోజనం చేస్తున్న సమయంలో సైరా విశేషాలను జగన్ కు చిరంజీవి వివరించారు. సైరా సినిమా బాగా తీసినట్లు తతాను కూడా విన్నానని ఈ సందర్భంగా జగన్ చిరంజీవితో అన్నట్లు తెలిసింది. ఈ సందర్భంగా చిరంజీవి జగన్ ను శాలువాతో సత్కరించగా, చిరంజీవి సతీమణి సురేఖ జగన్ సతీమణి భారతికి చీర బహుకరించారు.

Tags:    

Similar News