చింతమనేనిపై విచారణకు ఆదేశం

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన [more]

Update: 2019-02-28 09:54 GMT

దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ విప్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై జాతీయ ఎస్సీ కమిషన్ సీరియస్ అయ్యింది. దళితులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చింతమనేనిపై అనీల్ కుమార్ అనే వ్యక్తి జాతీయ ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన కమిషన్ చింతమనేని వ్యాఖ్యలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వ సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లో ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని స్పష్టం చేసింది.

Tags:    

Similar News