మే 31వరకూ ఇక్కడ లాక్ డౌన్

ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువవుతుండటంతో మే 31వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగించింది. వైరస్ [more]

Update: 2021-05-16 00:57 GMT

ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువవుతుండటంతో మే 31వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగించింది. వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం పేర్కొంది. జిల్లాల వారీగా ఆంక్షలనువిధించింది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ యాభై శాతానికి మించి పనిచేయరాదని పేర్కొంది. దుకాణాలు ప్రత్యామ్నాయంగా ఒకరోజు ఒకరు, మరో రోజు మరొకరు తెరుచుకునే వీలు కల్పించింది. ఆదివారం మాత్రం పూర్తి స్థాయి లాక్ డౌన్ అమలులో ఉంటుందని ఛత్తీస్ ఘడ్ ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News