చెన్నమనేని ఇంకా జర్మనీ పౌరుడే.. స్పష్టం చేసిన కేంద్రం

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం పై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేసింది. చెన్నమనేని రమేష్ ఇంకా జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని అఫిడవిట్ [more]

Update: 2021-04-02 01:08 GMT

వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం వివాదం పై కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ధాఖలు చేసింది. చెన్నమనేని రమేష్ ఇంకా జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నాడని అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. 2009 లో భారత పౌరసత్వం చెన్నమనేని రమేష్ పొందారు. అయితే అప్పటికే ఆయన జర్మనీ పౌరసత్వం కలిగి ఉన్నారు. 10 ఏళ్లకు ఒకేసారి జర్మనీ పాస్ పోర్ట్ ను ఇస్తారు. 2013 వరకు జర్మనీ పాస్ పోర్ట్ కలిగి ఉన్నట్లు ఇండియన్ సిటిజన్ షిప్ తీసుకునే ముందు చెన్నమనేని రమేష్ పేర్కొన్నారు. భారత దేశ పౌరసత్వం పొంది 2013 లో మళ్ళీ జర్మనీ పాస్ పోర్ట్ 2023 వరకు రేన్యువల్ ను చెన్నమనేని చేయించుకున్నారు. ఓవర్ ఓవర్ సిస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు చెన్నమనేని తీసుకున్నారు. దీనిపై తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

Tags:    

Similar News