బ్రేకింగ్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కేంద్రం షాక్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చెన్నమనేని రమేష్ వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. [more]

Update: 2019-11-20 12:52 GMT

టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. ఆయన భారత పౌరుడు కాదంటూ కేంద్ర హోంశాఖ ప్రకటించింది. చెన్నమనేని రమేష్ వేములవాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన పౌరసత్వంపై గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తోంది. చెన్నమనేని రమేష్ కు జర్మన్ పౌరసత్వం ఉందంటూ గతంలోనూ హైకోర్టులో విచారణ జరిగింది. తాజాగా హోంశాఖ నివేదిక ఇవ్వడంతో చెన్నమనేని రమేష్ ఎమ్మెల్యే పదవికి ఎసరు వచ్చినట్లయింది. చెన్నమనేని రమేష్ ద్వంద పౌరసత్వంపై బీజేపీ నేత ఆది శ్రీనివాస్ గత కొన్నేళ్లుగా పోరాడుతున్నారు.

Tags:    

Similar News