మ‌ళ్లీ తెర‌పైకి టాలీవుడ్ డ్ర‌గ్స్

టాలీవుడ్ లో సంచ‌ల‌నం సృష్టించిన డ్ర‌గ్స్ కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. 2017లో అలెక్స్ అనే డ్ర‌గ్ స‌ర‌ఫ‌రాదారుని పోలీసులు ప‌ట్టుకున్నారు. అతడిని విచారించిన స‌మ‌యంలో చాలామంది [more]

Update: 2019-05-14 07:11 GMT

టాలీవుడ్ లో సంచ‌ల‌నం సృష్టించిన డ్ర‌గ్స్ కేసు మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. 2017లో అలెక్స్ అనే డ్ర‌గ్ స‌ర‌ఫ‌రాదారుని పోలీసులు ప‌ట్టుకున్నారు. అతడిని విచారించిన స‌మ‌యంలో చాలామంది టాలీవుడ్ న‌టుల‌కు డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసిన‌ట్లు అత‌డు అంగీక‌రించాడు. దీంతో ఎక్సైజ్ శాఖ ఆధ్వ‌ర్యంలో విచార‌ణ కోసం అప్పుడే ఓ సిట్ ను నియ‌మించారు. ఈ సిట్ నెల రోజుల పాటు విచార‌ణ పేరుతో హ‌డ‌డావుడి చేసింది. 62 మంది టాలీవుడ్ న‌టులు, ఇత‌ర ప్ర‌ముఖుల గోర్లు, వెంట్రుక‌ల నుంచి న‌మూనాలు తీసుకొని ప‌రీక్ష‌ల‌కు పంపించారు. ర‌వితేజ‌, ఛార్మీ, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు వంటి వారిని విచారించారు. మొత్తంగా 12 కేసులు న‌మోదు చేశారు. అయితే, రెండేళ్లుగా ఈ కేసు విచార‌ణ మ‌రుగున‌ప‌డిపోయింది. మ‌ళ్లీ ఇవాళ పోలీసులు ఈ కేసును తెర‌పైకి తీసుకువ‌చ్చారు. 12 కేసుల్లో 4 కేసుల్లో ఛార్జిషీట్ల‌ను దాఖ‌లు చేశారు. అయితే, ఇంత‌మంది టాలీవుడ్ ప్ర‌ముఖుల‌ను ఈ కేసులో విచారించినా ఛార్జిషీట్‌లో మాత్రం ఒక్క‌రి పేరును కూడా చేర్చ‌కపోవ‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News