ఏపీ సచివాలయంలో మార్పులు

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో వాస్తుకు తగ్గట్లుగా మార్పులు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ సచివాలయానికి రావడానికి ముందే వాస్తు మార్పులు జరుపుతున్నారు. సీఎస్ చాంబర్ ను ఆగ్నేయ మూల [more]

Update: 2019-05-31 09:43 GMT

ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో వాస్తుకు తగ్గట్లుగా మార్పులు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ సచివాలయానికి రావడానికి ముందే వాస్తు మార్పులు జరుపుతున్నారు. సీఎస్ చాంబర్ ను ఆగ్నేయ మూల నుంచి వేరే చోటకు మారుస్తున్నారు. ఇందుకు గానూ సీఎస్ కు కొత్త చాంబర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇక, ముఖ్యమంత్రి చాంబర్ కు వెళ్లేందుకు ఇప్పటివరకు రెండు ద్వారాలు ఉండగా వాస్తుకు అనుగుణంగా ఒక ద్వారాన్ని మూసేస్తున్నారు. వాస్తు పనులు పూర్తయ్యాక వచ్చే వారంలో మంచి ముహూర్తం చూసుకొని జగన్ సచివాలయానికి రానున్నారు. అప్పటివరకు ఆయన తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచే విధులు నిర్వర్తించనున్నారు.

Tags:    

Similar News