టెన్షన్….టెన్షన్ బాబు టూర్

అమరావతిలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. కొందరు రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసన వ్కక్తం చేశారు. రాజధాని అమరావతిలో తమ హయాంలో [more]

Update: 2019-11-28 06:51 GMT

అమరావతిలో చంద్రబాబు పర్యటన ఉద్రిక్తతల మధ్య సాగుతోంది. కొందరు రైతులు నల్లబ్యాడ్జీలు ధరించి చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసన వ్కక్తం చేశారు. రాజధాని అమరావతిలో తమ హయాంలో జరిగిన పనులను, ఆ తర్వాత నిలిచిపోయిన నిర్మాణాలను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. దీంతో కొందరు నిరసన కారులు చంద్రబాబు కాన్వాయ్ పై చెప్పులు విసిరారు. తమ వద్ద నుంచి భూములు తీసుకునే టప్పుడు ఇచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేక పోయారని, చంద్రబాబు రైతులకు క్షమాపణ చెప్పాలని వారు నినాదాలు చేశారు. కొందరు చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు విసిరారు. అయితే ఈ దాడికి పాల్పడింది వైసీపీ కార్యకర్తలు మాత్రమేనని టీడీపీ నేతలు ఆరోపించారు. ఉద్రిక్తతల మధ్య చంద్రబాబు రాజధాని అమరావతి పర్యటన సాగుతోంది.

Tags:    

Similar News