ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు...?

Update: 2018-12-23 06:29 GMT

ఏ మొహం పెట్టుకుని ప్రధాని నరేంద్రమోదీ ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రశ్నించారు. బతికామా? చచ్చామో చూడటానికి మోదీ ఏపీకి వస్తున్నారా? అని నిలదీశారు. నాలుగున్నరేళ్లుగా విభజన చట్టం హామీలను అమలు చేయకుండా ఇప్పుడు ఏపీకి మోదీ ఎందుకు వస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రత్యేక హాదాను వ్యతిరేకించిందని, ఆ పార్టీ తెలంగాణలో గెలిస్తే ఇక్కడ వైసీపీ, జనసేనలు పండగ చేసుకున్నాయన్నారు.

దోషిగా నిలబెడతాం.....

బీజేపీని ప్రజల ముందు దోషిగా నిలబెడతామన్నారు. బీజేపీని సహకరించిన వారందరూ రాష్ట్రా భివృద్ధికి అడ్డుపడ్డట్లేనని చంద్రబాబు అన్నారు. బీజేపీతో లాలూచీ రాజకీయాలు చేస్తున్న వైసీపీ, జనసేనలకు ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకే కాంగ్రెస్ తో జత కట్టామని బాబు చెప్పారు. దేశంలో ప్రజాస్వామ్యం కాపాడటం, రాష్ట్రంలో అభివృద్ధి జరగడం కోసమే తాను అన్ని పార్టీలనూ ఏకం చేస్తున్నానన్నారు.

Similar News