బాబుది అతి "విలువైన" పోరాటం

Update: 2018-05-01 04:23 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీక్షల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. దీక్షలు అంత విలాసవంతంగా చేయడానికి డబ్బులెక్కడవని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టు పనుల్లో చేసిన అవినీతి డబ్బులను మోడీని తిట్టడానికి వినియోగిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇంత ఆర్భాటంగా, విలాసవంతంగా ఎవరూ సభలు నిర్వహించరన్నారు. తిరుపతిలో మోడీ వ్యాఖ్యలు ఎల్.సి.డి స్క్రీన్లపై చూపుదామనుకుంటే తిరుపతి వెంకన్న కూడా ఒప్పుకోలేదన్నారు. సభ ప్రారంభానికి ముందే అవి గాలి, వాన వచ్చి పడిపోయాయని ఎద్దేవా చేశారు. అందుకే వెంకన్న కూడా బాబు మాయ మాటలను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారన్నారు. చంద్రబాబు చేసింది ధర్మపోరాటం కాదని, అధర్మ పోరాటమని బీజేపీ విమర్శించింది. ఇప్పటికైనా కేంద్రప్రభుత్వంపై విమర్శలు మాని చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు.

Similar News