సోమవారం బాబుకు కేంద్రం నుంచి నోటీసులు

Update: 2018-09-08 11:20 GMT

బీజేపీ నేతలు పొలిటికల్ టెర్రరిస్టులుగా మారారని సినీ నటుడు శివాజి విమర్శించారు. ప్రజలతో కనెక్ట్ అయిన చంద్రబాబు నాయుడు కేంద్రం పక్కకు తప్పించడానికి సమయం చూసి జాతీయ పార్టీ పంజా విసిరిందని ఆరోపించారు. జాతీయ స్థాయికి చెందిన ఓ రాజ్యాంగబద్ధ సంస్థతో సోమవారం చంద్రబాబుకు నోటీసులు పంపించనున్నారని శివాజి జోస్యం చెప్పారు. ఆపరేషన్ ఆకర్ష్ ను మరోవిధంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలతో కనెక్ట్ అయిన చంద్రబాబును ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు. ఇంతత దారుణంగా రాజ్యాంగబద్ధ సంస్థలను వాడుకున్న దాఖలాలు లేవని ఆరోపించారు. జగన్ పైన ఇటువంటి కుట్రలు చేసినా తాను ఇలానే స్పందిస్తానని స్పష్టం చేశారు.

Similar News