కుప్పం నుంచి హైదరాబాద్ బయలుదేరిన బాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం పర్యటన ముగిసింది. పర్యటన చివరిరోజు కూడా చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కుప్పంలో మూడు రోజుల పాటు [more]

Update: 2021-02-27 06:11 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గం పర్యటన ముగిసింది. పర్యటన చివరిరోజు కూడా చంద్రబాబు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. కుప్పంలో మూడు రోజుల పాటు చంద్రబాబు పర్యటించారు. అన్ని మండలాల కార్యకర్తలతో సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను విశ్లేషించారు. రానున్న కాలంలో ధైర్యంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు పర్యటనకు మంచి స్పందన రావడంతో తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం నెలకొంది. కుప్పం నియోజకవర్గం నుంచి బయలు దేరిన చంద్రబాబు మరికాసేపట్లో హైదరాబాద్ చేరుకోనున్నారు.

Tags:    

Similar News