ిచిత్తూరు ఎస్పీకి చంద్రబాబు లేఖ

చిత్తూరు జిల్లా ఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. కుప్పం [more]

Update: 2020-10-27 05:24 GMT

చిత్తూరు జిల్లా ఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. అరెస్ట్ చేసిన టీడీపీ నేతలను బేషరతుగా విడుదల చేయాలని చంద్రబాబు ఆ లేఖలో కోరారు. కుప్పం నియోజకవర్గంలో సాగునీటి కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తామంటే పోలీసులు అడ్డుకోవడమేంటని ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారమే తమ పార్టీ నేతలు ఆందోళన చేస్తున్నారన్నారు. అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడం దారుణమని చంద్రబాబు అన్నారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఆందోళన ద్వారా ఎలా తీసుకెళతారని చంద్రబాబు ఆ లేఖలో ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన నేతలందరినీ విడుదల చేయాలని కోరారు.

Tags:    

Similar News