దానిపైన కూడా సీబీఐ దర్యాప్తు జరపాలి

దళితులపై జరుగుతున్న దాడులపై సీబీఐ దర్యాప్తు జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. [more]

Update: 2020-09-12 03:15 GMT

దళితులపై జరుగుతున్న దాడులపై సీబీఐ దర్యాప్తు జరపాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వరసగా దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. గత ఎన్నికల్లో ఎస్సీలు ఓట్లు వేసిన పాపానికి వారిపై దాడులు చేయిస్తున్నారన్నారు. దళిత శంఖారావంలో చంద్రబాబు మాట్లాడారు. దళితుల హక్కుల కోసం ఉద్యమించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కమిషన్ కు, మానవ హక్కుల కమిషన్ కు కూడా ఫిర్యాదు చేయాలన్నారు. టీడీపీ దళితులకు అండగా నిలబడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. వరసగా ఏపీలో జరుగుతున్న దాడులపై సీబీఐ దర్యాప్తు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News