నోటీసులకు స్పందించని బాబు… దీంతో పోలీసులు…?

చిత్తూరు జిల్లా పోలీసులు ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు స్పందించలేదు. దీంతో పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఓంప్రతాప్ అనే యువకుడు మృతిపై చంద్రబాబు వ్యాఖ్యలు [more]

Update: 2020-09-10 03:04 GMT

చిత్తూరు జిల్లా పోలీసులు ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు స్పందించలేదు. దీంతో పోలీసులు న్యాయనిపుణుల సలహా తీసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో ఓంప్రతాప్ అనే యువకుడు మృతిపై చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. మంత్రి పెద్దిరెడ్డితో పాటు వైసీపీ నేతల వేధింపుల వల్లనే ఓంప్రతాప్ చనిపోయాడని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై ఆధారాలు సమర్పించాలని చంద్రబాబుకు ఈనెల 1వ తేదీన చిత్తూరు జిల్లా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వారం రోజులు దాటినా సమాధానం లేదు. ఇంతవరకూ చంద్రబాబు సమాధానం ఇవ్వలేదు. దీంతో వారు తదుపరి చర్యకు దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News