మా దగ్గర ఆధారాలున్నాయి.. వైసీపీ ప్రభుత్వమే?

ఎల్జీ పాలిమర్స్ కు అనుమతులచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని, అందుకు తమ వద్ద ఆధారాలున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్ లో పాలి స్టైరిన్, ఎక్పాపండబుల్ [more]

Update: 2020-05-13 02:34 GMT

ఎల్జీ పాలిమర్స్ కు అనుమతులచ్చింది వైసీపీ ప్రభుత్వమేనని, అందుకు తమ వద్ద ఆధారాలున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎల్జీ పాలిమర్స్ లో పాలి స్టైరిన్, ఎక్పాపండబుల్ పాలిస్టైరిన్ అనుమతులకు సిఫార్సు చేస్తూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి పంపింది నిజం కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. పైగా టీడీపీ హయాంలోనే వాటికి అనుమతులిచ్చినట్లు విష ప్రచారానికి దిగారని చంద్రబాబు మండి పడ్డారు. దక్షిణ కొరియాలో మాదిరిగా నష్టపరిహారం బాధితులకు ప్రకటించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ఈ నెల 28వ తేదీన విశాఖకు సచివాలయాన్ని తరలించే ప్రయత్నంలో ఉందని చంద్రబాబు ఆరోపించారు. విశాఖ దుర్ఘటనకు జగన్, విజయసాయిరెడ్డిలే బాధ్యత వహించాలన్నారు.

Tags:    

Similar News