బ్రేకింగ్ : పాదయాత్రగా బయలుదేరిన చంద్రబాబు

చంద్రబాబునాయుడు డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. పాదయాత్రగా ఆయన పార్టీ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్ కు వెళ్లారు. చంద్రబాబు వెంట మాచర్ల దాడి ఘటనలో గాయపడిన బుద్దా [more]

Update: 2020-03-11 13:07 GMT

చంద్రబాబునాయుడు డీజీపీ కార్యాలయానికి బయలుదేరారు. పాదయాత్రగా ఆయన పార్టీ కార్యాలయం నుంచి డీజీపీ ఆఫీస్ కు వెళ్లారు. చంద్రబాబు వెంట మాచర్ల దాడి ఘటనలో గాయపడిన బుద్దా వెంకన్న, బోండా ఉమతో పాటు సీపీఐ రామకృష్ణ తదితరులు ఉన్నారు. టీడీపీ నేతలపై జరుగుతున్న దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు చంద్రబాబు పాదయాత్రగా బయలు దేరి వెళ్లారు. చంద్రబాబు వెంట సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా ఉన్నారు. చంద్రబాబు వెంట వందల సంఖ్యలో కార్యకర్తలు డీజీపీ ఆఫీసుకు బయలుదేరి వెళ్లారు. డీజీపీని కలసిన తర్వాత ఎన్నికల కమిషనర్ ను కూడా చంద్రబాబు కలిసే అవకాశముంది.

Tags:    

Similar News