బ్రేకింగ్ : బాబు ఫ్లైట్ దిగక ముందే ఇరు పార్టీల నేతలు?

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ వైసీపీ [more]

Update: 2020-02-27 05:11 GMT

విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు విశాఖ పర్యటనను అడ్డుకోవాలని వైసీపీ పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు పర్యటనను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు టీడీపీ శ్రేణులు కూడా పెద్దయెత్తున ఎయిర్ పోర్టుకు తరలి వచ్చాయి. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. రెండు పార్టీల నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరు పార్టీల నేతలను, కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టారు. చంద్రబాబును ఎయిర్ పోర్టు నుంచి బయటకు రానివ్వకుండా అడ్డుకుంటామని వైసీపీ నేతలు చెబుతున్నారు. తమ నేత పర్యటనను ఎలా అడ్డుకుంటారో చూస్తామని టీడీపీ నేతలు సవాల్ విసరుతున్నారు. మొత్తం మీద విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు గో బ్యాక్ అంటూ వైసీపీ నేతలు, బాబు జిందాబాద్ అంటూ టీడీపీ నేతల నినాదాలతో విశాఖ ఎయిర్ పోర్టు మార్మోగిపోతుంది.

Tags:    

Similar News