ఎంపీలతో చంద్రబాబు

పార్లమెంటు సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు మరికొద్దిసేపట్లో సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుండటంతో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను గురించి [more]

Update: 2020-01-28 04:53 GMT

పార్లమెంటు సభ్యులతో టీడీపీ అధినేత చంద్రబాబు మరికొద్దిసేపట్లో సమావేశం కానున్నారు. పార్లమెంటు సమావేశాలు మరో మూడు రోజుల్లో ప్రారంభం కానుండటంతో పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను గురించి చంద్రబాబు ఎంపీలతో చర్చించనున్నారు. దీంతో పాటు శాసనమండలి రద్దుపైనా, అమరావతి రాజధాని అంశంపై భవిష్యత్ కార్యాచరణను కూడా వారితో చర్చించనున్నట్ల తెలుస్తోంది. ఈ సమావేశంలో ఎంపీలతో పాటు సీనియర్ నేతలు పాల్గొననున్నారు. అయితే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కూడా కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ఎంపీలకు సూచించనున్నారు.

Tags:    

Similar News