పండగొద్దు మనకు

సంక్రాంతి పండగ చేసుకోవద్దని చంద్రబాబు పార్టీ నేతలకు, ప్రజలకు పిలుపు నిచ్చారు. అమరావతి రాజధాని తేలితేనే సంక్రాంతి పండగ అని అన్నారు. భోగి పండగ రోజున జీఎన్ [more]

Update: 2020-01-04 08:56 GMT

సంక్రాంతి పండగ చేసుకోవద్దని చంద్రబాబు పార్టీ నేతలకు, ప్రజలకు పిలుపు నిచ్చారు. అమరావతి రాజధాని తేలితేనే సంక్రాంతి పండగ అని అన్నారు. భోగి పండగ రోజున జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ రిపోర్టులను తగలబెట్టమని చంద్రబాబు పిలుపు నిచ్చారు. అలాగే పెద్దల పండగ రోజు కూడా అమరావతిని కాపాడాలంటూ పెద్దలను వేడుకోవాలన్నారు. చివరకు ఉద్యోగులు సయితం జగన్ ఉన్మాదానికి భయపడిపోతున్నారన్నారు. పోలవరం, రాజధాని అమరావతిని చంపేస్తే ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఉద్యోగుల పాత్రను మర్చిపోయారా? అని ప్రశ్నించారు. అమరావతి రైతుల సమస్య కాదని, ఐదు కోట్ల ప్రజలు సమస్య అని చంద్రబాబు చెప్పారు. అమరావతిని రక్షించుకునేందుకు న్యాయపోరాటం కూడా చేస్తామని చంద్రబాబు చెప్పారు.

Tags:    

Similar News