ఊహించని షాక్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం స్టే గడువు పొడించలేమని స్పష్టం చేసింది. [more]

Update: 2019-11-19 01:53 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం స్టే గడువు పొడించలేమని స్పష్టం చేసింది. దీంతో చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై విచారణ జరగనుంది. దాదాపు 14 ఏళ్ల క్రితం చంద్రబాబుపై లక్ష్మీపార్వతి ఏసీపీ కోర్టుకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబుకు ఆదాయానికి మించిన ఆస్తులున్నాయని దీనిపై విచారించాలని లక్ష్మీపార్వతి పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీనిపై చంద్రబాబు 2005లో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. స్టే గడువు ముగియడంతో దీనిపై విచారణ కొనసాగిస్తామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

Tags:    

Similar News