వందరోజులూ ప్రతీకారం కోసమే

తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షస పాలన ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు [more]

Update: 2019-09-06 11:46 GMT

తన 40ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి రాక్షస పాలన ఎప్పుడూ చూడలేదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని, రాష్ట్ర మంతా ఫ్యాక్షనిజమే అయ్యిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. గతంలో ఎంతో మంది నేతలతో పోరాడామని ఇలాంటి విధ్వంసక రాజకీయాలు ఎప్పుడూ లేవన్నారు. ప్రజలు ఓట్లేసి గెలిపించింది ప్రతీకారం తీర్చుకోవడానికానని ప్రశ్నించారు. వైసీపీకి క్యాడర్ లేదని, కొన్ని పరిస్థితులు కలిసి రావడంతో ఆ పార్టీ అధికారంలోకివచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. టీడీపీ కార్యకర్తల పై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమానికి అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు చెప్పారు.

Tags:    

Similar News