ఇక ఉమ్మడి ఉద్యమమే

వైసీపీ పాలన, రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో జరుగుతున్న వ్యవహారంపై ఉమ్మడి ఉద్యమాన్ని నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని అమరావతి విషయంలో [more]

Update: 2019-08-26 14:22 GMT

వైసీపీ పాలన, రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో జరుగుతున్న వ్యవహారంపై ఉమ్మడి ఉద్యమాన్ని నిర్వహిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అన్ని పార్టీలను కలుపుకుని అమరావతి విషయంలో పోరాటం సాగిస్తామని ఆయన తెలిపారు. సీనియర్ నేతలతో చంద్రబాబు సమావేశమయ్యారు. త్వరలోనే వైసీపీ వంద రోజుల పాలనపై పుస్తకాన్ని విడుదల చేస్తామని ఆయన తెలిపారు. తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అమరావతి అభివృద్ధిని నిలిపివేయడం సరికాదన్నారు. వైసైపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారని చెప్పారు. పార్టీలన్నింటినీ వైసీపీకి వ్యతిరేకంగా ఒకే వేదికపైకి తీసుకొచ్చేందుకు కమిటీ ని నియమించనున్నట్లు ఆయన తెలిపారు.

Tags:    

Similar News