Chandrababu : ఈ ఎన్నికలన్నీ ఒక పెద్ద ఫార్సు

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్, నేరస్థుడని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. [more]

Update: 2021-11-11 13:06 GMT

మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్, నేరస్థుడని చంద్రబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెదిరించి నామినేషన్లను ఉపసంహరిస్తున్నారన్నారు. గత ఎన్నికల్లో ఒక్క కుప్పం మున్సిపాలిటీలో పదివేల మెజారిటీ వచ్చిందని, కుప్పంను గెలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పెద్దిరెడ్డి తన చేతి నుంచి తప్పించుకోలేరన్నారు. తిరుపతి ఉప ఎన్నిక కూడా పెద్ద ఫార్సు అని చంద్రబాబు అన్నారు. ఆఫీసర్లందరూ కలసి రిగ్గింగ్ చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఎన్నికలను నిర్వహించడం ఇలాగేనా అని ప్రశ్నించారు.

ఎందుకు ఏకగ్రీవాలవుతున్నాయ్?

పుంగనూరులో ఇన్ని ఏకగ్రీవం ఎందుకు అవుతున్నాయని చంద్రబాబు ప్రశ్నించారు. టెక్నాలజీ ద్వారా అక్రమాలు జరిగాయని నిర్ధారణ అయిందని చంద్రబాబు అన్నారు. రేపనే రోజున అధికారులు ఎవరూ తమ నుంచి తప్పించుకోలేరని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అమరావతి రైతులు పాదయాత్ర చేయడం పాపమా? అని చంద్రబాబు నిలదీశారు.

Tags:    

Similar News