Chandrababu : అడుగడుగునా అడ్డంకులే

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతుల మహాపాదయాత్ర చూసి జగన్ భయపడుతున్నారన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నారని [more]

Update: 2021-11-11 12:27 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రైతుల మహాపాదయాత్ర చూసి జగన్ భయపడుతున్నారన్నారు. రైతుల పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. హైకోర్టు ఆదేశాలతోనే రైతులు మహాపాదయాత్ర చేస్తున్నా పోలీసులు అడుగడుగునా ఆటంకాలు కల్గిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

అందుకే భయం…

మూడు రాజధానులు వ్యవహారం తనను ముంచేస్తుందని జగన్ భయపడుతున్నారన్నారు. రైతుల పాదయాత్రకు పెద్దయెత్తున స్పందన వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రజలు స్వచ్ఛందంగా రైతుల యాత్రకు మద్దతు తెలుపుతున్నారన్నారు. రైతుల పై పోలీసుల లాఠీ ఛార్జి దారుణమని చంద్రబాబు అన్నారు.

Tags:    

Similar News