Chandrababu : మరోసారి కుప్పం పిలుస్తోందా? రా రమ్మంటుందా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈరోజు, రేపటిలో కుప్పంలో ఆయన పర్యటించే అవకాశముంది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో [more]

Update: 2021-11-10 04:04 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన ఉండే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈరోజు, రేపటిలో కుప్పంలో ఆయన పర్యటించే అవకాశముంది. కుప్పం మున్సిపాలిటీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ టీడీపీ నేతల అరెస్ట్ లు, ప్రలోభాలు తదితర అంశాలు చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో ఆయన కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇప్పటికే రెండు రోజులు….

నిజానికి నోటిఫికేషన్ కు ముందే చంద్రబాబు కుప్పంలో రెండు రోజుల పాటు పర్యటించి వచ్చారు. ప్రతిరోజూ కుప్పం నేతలతో టెలికాన్ఫరెన్స్ ను నిర్వహిస్తున్నారు. అయినా వైసీపీ ప్రభుత్వం తమపై దాష్టీకాలకు దిగుతుందని, కుప్పంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుందని పేర్కొంటూ మరోసారి చంద్రబాబు కుప్పంలో పర్యటించే అవకాశాలున్నాయి. ఇంకా పర్యటనపై స్పష్టత రానప్పటికీ ఆయన ప్రచారంలో పాల్గొనే అవకాశాలను టీడీపీ నేతలు కొట్టి పారేయడం లేదు.

Tags:    

Similar News