Chandrababu: జగన్ కు చంద్రబాబు లేఖ

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. కడప నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించాలని లేఖలో కోరారు. పరిశ్రమలు అభివృద్ది [more]

Update: 2021-10-10 07:29 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు లేఖ రాశారు. కడప నుంచి విమాన సర్వీసులను పునరుద్ధరించాలని లేఖలో కోరారు. పరిశ్రమలు అభివృద్ది చెందాలంటే రవాణా సౌకర్యం అవసరమని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఉడాన్ పధకాన్ని సద్వినియోగం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాలకు విమాన సర్వీసులను ఏర్పాటు చేశామన్నారు. పారిశ్రామికవేత్తలను దృష్టిలో పెట్టుకుని కడప విమానాశ్రయం నుంచి సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు.

Tags:    

Similar News