పండగ పూట కూడా చంద్రబాబు

ఏపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన గణేష్ [more]

Update: 2021-09-10 06:57 GMT

ఏపీ ప్రభుత్వం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీ చీఫ్ చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో జరిగిన గణేష్ పూజలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజల మనోభావాలను గుర్తించాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. హైదరాబాద్ లో తాను అధికారంలో ఉండగా అన్ని మతాల విశ్వాసాలను గౌరవించేవారమని చంద్రబాబు గుర్తు చేశారు. వినాయక చవితి ఉత్సవాలను జరుపుకోరాదని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, చివరకు కోర్టుకెళ్లి ఆర్డరు తెచ్చుకోవాల్సిన పరిస్థిితి ఏర్పడిందన్నారు.

Tags:    

Similar News