త్వరలో కుప్పంకు చంద్రబాబు

త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కుప్పం నేతలతో చంద్రబాబు [more]

Update: 2021-02-21 01:45 GMT

త్వరలోనే టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కుప్పం నేతలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తాను రెండు రోజుల పాటు కుప్పం లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తానని చంద్రబాబు తెలిపారు. ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, స్థానిక నాయకత్వం నిర్లక్ష్యం కారణంగానే కుప్పం నియోజకవర్గంలో కొన్ని పంచాయతీలను కోల్పోవాల్సి వచ్చిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రెండు, మూడురోజుల్లో కుప్పం పర్యటన వివరాలను తెలియజేస్తానని చంద్రబాబు తెలిపారు.

Tags:    

Similar News