జగన్ మెడపైన, ఇంటిపైన క్రాస్ ఉంటుంది

జగన్ కు ఉన్న సెంటిమెంట్ మాకు ఉండవా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రామతీర్థం పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం జగన్ మెడలో, ఇంటి [more]

Update: 2021-01-02 12:43 GMT

జగన్ కు ఉన్న సెంటిమెంట్ మాకు ఉండవా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. రామతీర్థం పర్యటించిన అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం జగన్ మెడలో, ఇంటి మీద క్రాస్ ఉంటుందని చెప్పారు. జగన్ వచ్చిన తర్వాతనే హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయన్నారు. జగన్ మతం ఏదైనా మరో మతాన్ని గౌరవించాలన్నారు చంద్రబాబు. తిరుమల కొండపైన కూడా వైసీపీ నేతలు డ్రోన్ లు తిప్పారన్నారు. రాముడు నడిచిన ప్రదేశం రామతీర్థం అని అన్నారు. ఒకే మతానికి జగన్ కొమ్ము కాస్తున్నారన్నారు. దేవుడి జోలికి వస్తే మసి అయిపోతారని చంద్రబాబు శాపనార్థాలు పెట్టారు. తిరుమల వెళ్లిన జగన్ డిక్లరేషన్ ఇచ్చారా? అని చంద్రబాబు ప్రశ్నించారు. శ్రీవారి జోలికి వెళితే ఈజన్మలోనే శిక్షిస్తారన్నారు. ప్రజలు తిరగబడితే ఎక్కడికి పోతారని చంద్రబాబు నిలదీశారు.

Tags:    

Similar News