సుహాసిని గెలుపును ఎవరూ ఆపలేరు

Update: 2018-12-01 13:27 GMT

కేసీఆర్ కు రాజకీయ జన్మనిచ్చిన వ్యక్తి ఎన్టీరామారావు అని, ఆయన కు రధసారధిగా పనిచేసిన వ్యక్తి నందమూరి హరికృష్ణ అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్టీఆర్, హరికృష్ణ ల స్ఫూర్తితో సుహాసినిని కూకట్ పల్లి నియోజకవర్గంలో గెలిపించాలని కోరారు. హరికృష్ణ ఆత్మకు శాంతి కల్గించాలంటే సుహాసినిని గెలిపించాలని చంద్రబాబుకోరారు. కూకట్ పల్లిలో సుహాసినికి మద్దతుగా ఆయన రోడ్ షో నిర్వహించారు. తాను హైదరాబాద్ కట్టలేదని, సైబరాబాద్ ను నిర్మించానని గర్వంగా చెప్పగలనని అన్నారు. కేసీఆర్, మోదీ కుమ్మక్కయ్యారన్నారు. సీబీఐ కేసు నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ మోదీతో లాలూచీ పడ్డారన్నారు. తాను ఎవరికీ భయపడనన్నారు. తాను తెలంగాణలో పోటీ చేసే అవకాశం లేదని, ఆంద్రప్రదేశ్ లో పోటీ చేస్తానని, అక్కడి నుంచి అవసరమైతే జాతీయ రాజకీయాల్లోకి వెళతానని తెలిపారు. కేసీఆర్ ఈ నాలుగున్నరేళ్లలో ఒక్క ఫ్లై ఓవర్ కట్టారా? అని ప్రశ్నించారు. సుహాసిని గెలుపును ఎవరూ ఆపలేరన్నారు.

Similar News