చంద్రబాబుపై మోత్కుపల్లి షాకింగ్ కామెంట్స్

Update: 2018-05-28 06:15 GMT

తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా జరుపుకుంటున్న సమయంలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళిలర్పించిన మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ దయ వల్లే తనలాంటి పేదలు రాజకీయాల్లోకి వచ్చారని, అలాంటి ఎన్టీఆర్ చావుకు చంద్రబాబే కారణని విమర్శించి దుమారం లేపారు. మాల మాదిగల మధ్య, కాపులు - బీసీలకు మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టారని, చివరకు బ్రాహ్మణుల మధ్య కూడా చిచ్చుపెడుతున్నారని విమర్శించారు. జగన్, పవన్ సొంత జెండా పెట్టుకున్నారని, వాళ్లు మొగోళ్లన్నారు. కానీ, చంద్రబాబు మాత్రం ఎన్టీఆర్ వద్ద టీడీపీ జెండా దొంగతనం చేశారని ధ్వజం ఎత్తారు. నా రాజకీయ జీవితాన్ని బలితీసుకోవాలని కుట్రలు చేస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టేందుకు ప్రయత్నించారన్నారు. నన్ను ఆలేరు నియోజకవర్గం ప్రజలు కాపాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

Similar News