బాబు లంచ్ మీటింగ్ లో....?

Update: 2018-10-27 08:03 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి దిగిన వెంటనే పార్టీ పార్లమెంటుసభ్యులతో సమావేశమయ్యారు. కాసేపట్లో జాతీయ నేతలతో లంచ్ మీటింగ్ లో పాల్గొననున్నారు. ఏపీ భవన్ లోనిర్వహించే ఈ సమావేశానికి అరవింద్ కేజ్రీవాల్, శరద్ యాదవ్, సురవరం సుధాకర్ రెడ్డిలు పాల్గొననున్నారు. గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అనైతికంగా చేస్తున్న ఆదాయపు పన్ను శాఖ దాడుల గురించి, జగన్, పవన్ కల్యాణ్ ను అడ్డం పెట్టుకుని బీజేపీ ఆడుతున్న డ్రామాలను ఈ సందర్భంగా వారికి చంద్రబాబు వివరించనున్నారు. అంతేకాకుండా గవర్నర్ జగన్ పై దాడి జరిగిన సంఘటలో వ్యవహరించిన తీరు కూడా ఈ సందర్భంగా ఎండగట్టనున్నారు. మధ్యాహ్నం 3గంటలకు జాతీయ మీడియాతో మాట్లాడనున్న చంద్రబాబు తర్వాత ఫరూక్ అబ్దుల్లాతో భేటీ కానున్నారు.

Similar News