చంద్రబాబు లేఖను బయటపెట్టిన కేంద్రమంత్రి

ప్రత్యేక ప్యాకేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని, ఆయన అంగీకారం మేరకే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మంగళవారం ఏపీ బీజేపీ [more]

Update: 2019-03-26 08:48 GMT

ప్రత్యేక ప్యాకేజీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంగీకరించారని, ఆయన అంగీకారం మేరకే కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. మంగళవారం ఏపీ బీజేపీ మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. దీంతో పాటు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరిస్తూ చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను ఆయన విడుదల చేశారు. 24.10.2016 తేదీన కేంద్రానికి చంద్రబాబు ఈ లేఖ రాశారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ లో దుష్ప్రచారం జరుగుతోందని, అపోహలను నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. చంద్రబాబు తన అనుభవాన్ని అవినీతికి ఉపయోగించారని ఆరోపించారు. అవినీతి, కుటుంబ పాలన అందిస్తున్న చంద్రబాబును ప్రజలు తిరస్కరిస్తారని పేర్కొన్నారు.

Tags:    

Similar News