రికార్డు మెజారిటీ దిశగా జగన్… సగానికి తగ్గిన బాబు మెజారిటీ

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గాన్నీ తాకింది. చిత్తూరు జిల్లాలో 10 స్థానాలకు పైగా గెలుచుకుంటున్న వైసీపీ కుప్పంలో చంద్రబాబు మెజారిటీని సగానికి తగ్గించేసింది. [more]

Update: 2019-05-23 10:44 GMT

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ముఖ్యమంత్రి స్వంత నియోజకవర్గాన్నీ తాకింది. చిత్తూరు జిల్లాలో 10 స్థానాలకు పైగా గెలుచుకుంటున్న వైసీపీ కుప్పంలో చంద్రబాబు మెజారిటీని సగానికి తగ్గించేసింది. గత ఎన్నికల్లో 50 వేలకు పైగా మెజారిటీతో గెలిచిన చంద్రబాబు ఈసారి కేవలం 29 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఇదే సమయంలో పులివెందుల నియోజకవర్గంలో జగన్ మెజారిటీ భారీగా పెరుగుతోంది. ఇప్పటికే 85 వేల మెజారిటీ దాటిన జగన్ లక్ష మార్క్ దాటే అవకాశం కనిపిస్తోంది.

Tags:    

Similar News