జగన్ డైలాగునే తిప్పికొట్టారుగా

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు రావడంపై సెటైరు వేశారు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే ఈ [more]

Update: 2019-08-15 14:25 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు రావడంపై సెటైరు వేశారు. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే ఈ ఎన్నికల్లో అంతమందినే చంద్రబాబుకు దేవుడు తిరిగి ఇచ్చారన్నారు. దేవుడు స్క్రిప్ట్ ను భలే రాశారన్నారు. ఇప్పుడు అదే డైలాగ్ ను చంద్రబాబు జగన్ పై వాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అమరావతిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దానిని చూపిస్తూ భ్రమరావతి, అమరావతి గ్రాఫిక్స్ అన్నవారే నేడు అక్కడ లైటింగ్ పెట్టారని, దేవుడు స్క్రిప్ట్ భలే రాశారని చంద్రబాబు ట్విట్టర్ లో జగన్ పై సెటైర్ వేశారు.

Tags:    

Similar News