పోతిరెడ్డిపాడు పై ఏపీ ముందడుగు వేయకుండా?

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వ్యవహారంలో కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోక్యం చేసుకున్నారు. జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరా తీశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి [more]

Update: 2020-05-16 07:18 GMT

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వ్యవహారంలో కేంద్ర జలవనరుల శాఖమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ జోక్యం చేసుకున్నారు. జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆరా తీశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన లేఖకు షెకావత్ స్పందించారు. కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డుకు షెకావత్ లేఖ రాశారు. పోతిరెడ్డిప్రాజెక్టు విషయంలో జరుగుతున్న వ్యవహారంపై తక్షణం చర్యలు తీసుకోవాలని షెకావత్ బోర్డుకు సూచించారు. ఇరు రాష్ట్రాల మధ్య జలవివాదాలు తలెత్తకుండా చూడాలని ఆయన కోరారు. వెంటనే అపెక్స్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పూర్తి స్థాయి నివేదిక వచ్చేంత వరకూ ఏపీ ముందడగు వేయకుండా చూడాలని షెకావత్ కోరారు.

Tags:    

Similar News