అప్రమత్తమయిన కేంద్ర ప్రభుత్వం.. కేసులు పెరుగుతుండటంతో?

కేంద్ర ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమయింది. రోజుకు లక్ష కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో పెరుగుతున్న కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఐదంచెల [more]

Update: 2021-04-05 01:21 GMT

కేంద్ర ప్రభుత్వం కరోనా కేసులు పెరుగుతుండటంతో అప్రమత్తమయింది. రోజుకు లక్ష కేసులు నమోదవుతుండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో పెరుగుతున్న కరోనాను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఐదంచెల వ్యూహాన్ని రెడీ చేయాలని నిర్ణయించింది. ఇటు టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్ మెంట్ తో పాటు, కరోనా నిబంధనలను పాటించడం, వ్యాక్సినేషన్ ను వేగంగా పూర్తి చేయడంపై దృష్టి సారించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న రాష్ట్రాలకు ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. కేసులు ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర, పంజాబ్, ఛత్తీస్ ఘడ్ లకు కేంద్ర బృందాలను పంపాలని నిర్ణయించింది.

Tags:    

Similar News