బ్రేకింగ్ : మద్యం విక్రయాలకు అనుమతి

మద్యం విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మే 17వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగించినప్పటికీ గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో మద్యం విక్రయాలకు [more]

Update: 2020-05-01 14:07 GMT

మద్యం విక్రయాలకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మే 17వ తేదీ వరకూ లాక్ డౌన్ ను పొడిగించినప్పటికీ గ్రీన్, ఆరెంజ్ జోన్ లలో మద్యం విక్రయాలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెడ్ జోన్ లలో మాత్రం మద్యం విక్రయాలకు అనుమతి లేదు. మద్యం షాపుల వద్ద ఐదుగురికి మించి ఉండటానికి వీలు లేదు. ఒకేసారి ఐదుగురికి మాత్రమే మద్యం షాపుల వద్ద అనుమతి ఇస్తారు. ఆరెంజ్, గ్రీన్ జోన్లలో వ్యవసాయపనులకు పూర్తి అనుమతి ఇచ్చారు. ప్రయివేటు క్యాబ్ లకు కూడా అనుమతి ఇచ్చారు. గ్రీన్ జోన్లలో పరిమిత సంఖ్యలో రవాణాకు అనుమతి ఇచ్చారు.

Tags:    

Similar News