రెండు రాష్ట్రాలూ డీపీఆర్ లు ఇవ్వాల్సిందే

రెండు తెలుగు రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులపై డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాలని కేంద్ర మరోసారి ఆదేశించింది. కృష్ణా, గోదావరి నదులపై చేపడుతున్న కొత్త [more]

Update: 2021-02-05 01:49 GMT

రెండు తెలుగు రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో చేపడుతున్న కొత్త ప్రాజెక్టులపై డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టులు ఇవ్వాలని కేంద్ర మరోసారి ఆదేశించింది. కృష్ణా, గోదావరి నదులపై చేపడుతున్న కొత్త ప్రాజెక్టులకు సంబంధించి డీపీఆర్ లను పంపాలని కోరింది. ఈ మేరకు అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డీపీఆర్ లు ఇవ్వకుండా, అనుమతులు తీసుకోకుండా కొత్త ప్రాజెక్టుల నిర్మాణం సాధ్యం కాదని పేర్కొంది. ఈ విషయాన్ని లోక్ సభలో జలశక్తి శాఖ సహాయ మంత్రి రతన్ లాల్ కటారియా ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు.

Tags:    

Similar News